Friday, October 18, 2024

Guntur| రోడ్డుప్ర‌మాదంలో యువ‌తి దుర్మ‌ర‌ణం

గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఢీకొట్డంతో స్కూటీపై వెళ్తున్న యువతి మరణించింది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని రుద్ర ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతిచెందిన యువతి పొన్నూరు రోడ్డు చినబజార్ కు చెందిన పర్వీన్ (16) గా పోలీసులు నిర్థారించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement