Tuesday, September 17, 2024

Jagan | వరద బాధితులకు వైసీపీ రూ.కోటి సాయం

భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహానికి ఏపీ ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ తరపున రూ.కోటి ప్రభుత్వానికి ప్రకటించారు. అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పలువురు మాజీ మంత్రులు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వరద బాధితులకు ఆర్థిక సాయం ఇవ్వాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో సోమవారం తాను చేసిన పర్యటనలో వరద బాధితుల సమస్యలను స్వయంగా చూశానని జగన్ అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని జగన్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement