Sunday, October 20, 2024

YCP జండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా – దేవినేని అవినాష్

( ఆంధ్రప్రభ జగ్గయ్యపేట ) స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు పార్టీలు మారిన క్షేత్రస్థాయిలో వైసిపి బలంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు.పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా వైసిపి ఉంటుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటున్న నాయకులకు కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

2029 లో అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నాగమయ్య బజారులో అధికార పార్టీ ఆగడాలకు బలైన వైసీపీ సానుభూతిపరుడు గుగ్గిళ్ళ శ్రీను కుటుంబాన్ని పరామర్శించి ,రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆదివారం అందజేశారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు బలైన గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీను మరణాన్ని వైసీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆర్థికంగా రెండు లక్షలు అందజేయాలని ఆదేశించారని అన్నారు.

- Advertisement -

దేశంలో తమ పార్టీ నాయకుల, కార్యకర్తల బాగోగులు చూసుకునే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని కొందరు సీనియర్ నాయకులు వీడిన కార్యకర్తలు ఎక్కడ ధైర్యం కోల్పోకుండా అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటూ ముందుకు వెళ్ళటం అభినందనీయం అన్నారు. పార్టీలోని ప్రతి నాయకుడికి, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచిన ప్రతి నాయకుడు ,కార్యకర్త 2029లో వైసీపీ పార్టీ అధికారమై లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటురి రాజగోపాల్ (చిన్న), ఎంపీపీలు మార్కాపూడి గాంధీ, రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నీసా, కౌన్సిలర్ వట్టెం మనోహర్, నంబూరి రవి, భద్దునాయక్, చౌదవరపు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement