Tuesday, October 22, 2024

AP | తెలుగుదేశంలోకి వైసీపీ కార్పొరేటర్లు…

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : జ‌గ‌న్ పాల‌న ఆలోచ‌న తీరుతో రాష్ట్ర ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు… వైసిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా విసిగిపోయారనీ. అందుకే విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధి కోసం స్వ‌చ్ఛందంగా, బేష‌ర‌తుగా వైసిపి వీడి టిడిపిలో వ‌స్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు వైసిపి కార్పొరేట‌ర్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మ‌క్షంలో టిడిపి కండువాలు క‌ప్పుకున్నారు. 45వ, 44వ, 54వ డివిజ‌న్స్ కి చెందిన వైసీపీ కార్పొరేట‌ర్స్ ఎస్.కె.హ‌ర్ష‌ద్, మైల‌వ‌ర‌పు ర‌త్న‌కుమారి, మ‌ధూరి లావ‌ణ్య వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎంపి కేశినేని శివ‌నాథ్, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా పార్టీ కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానం ప‌లికారు.

బెజ‌వాడ‌లో ప్రతిపక్ష పార్టీ ఉండకుండా చేస్తాం..

ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ…. పార్టీలో సీనియ‌ర్ స‌ల‌హాలు తీసుకుంటూ విజ‌య‌వాడ‌ను టిడిపికి కంచుకోట‌గా మారుస్తాన‌న్నారు. న‌గ‌రంలో విప‌క్ష‌పార్టీలు లేకుండా చేసేందుకు ఒక ప్ర‌ణాళిక‌తో నాయ‌కులంద‌రం క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ‌తామ‌న్నారు. టిడిపిలోకి రావ‌టానికి వైసిపి కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే కాదు నాయ‌కులు కూడా సిద్దంగా వున్నార‌ని తెలిపారు.

అయితే న‌గ‌రాభివృద్ది కోరుకునే వారిని, స్వ‌చ్ఛందంగా వ‌చ్చే వారిని మాత్ర‌మే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్ర‌జ‌ల్లో మంచి పేరు వున్న నాయ‌కుల‌ను మాత్ర‌మే టిడిపిలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. న‌గరాభివృద్ది కాంక్షిస్తూ ఆ పార్టీని వీడి టిడిపిలోకి చేరిన ముగ్గురు కార్పొరేటర్స్ ను అభినందించారు. ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ , బిజెపి ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి,,నాగుల్ మీరా తో క‌లిసి విజ‌య‌వాడ అభివృద్ది చేసి చూపిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement