Thursday, September 19, 2024

AP | స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా కాపాడతా : చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్ష నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయివేటీకరణ చేయకుండా కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు.

ఈరోజు కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని చంద్రబాబు అన్నారు. వీలైనంత వరకు ప్లాంట్ ను కాపాడుకుంటామన్నారు. ఎన్డీయే కూటమికి విశాఖపట్నం చాలా ముఖ్యమైన నగరమని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement