Thursday, September 19, 2024

AP | ఎక్కడ గండ్లు పడలేదు… పుకార్లు నమ్మవద్దు : కలెక్టర్ సృజన

(ప్రభ న్యూస్, విజయవాడ) : బుడమేరు కాలువలకు మళ్లీ గండ్లు పడ్డాయి అన్న వార్త నగరవాసుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. శనివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాతో పాటు పలు సామాజిక మాధ్యమాలలో బుడమేరుకు భారీ వరద నీరు వచ్చింది, గండ్లు పడ్డాయి, విజయవాడకు మళ్ళీ ముంపు తప్పదు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన స్పందించారు.

బుడమేరు కాల్వకు ఎక్కడ ఎటువంటి గండ్లు పడలేదని, ప్రస్తుతం బుడమేరు కాలువలో వెయ్కిసిక్కుల నీటి ప్రవాహం మాత్రమే ఉందని తెలిపారు. కావాలని కొందరు అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారని ఇటువంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బుడమేరు కాలువకు ఎక్కడ ఎటువంటి గండ్లు పడలేదని, ప్రమాదం లేదని ప్రస్తుతం సింగనగర్, ఆర్ఆర్ పేట, మిల్క్ ప్రాజెక్టు తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో మైక్ ద్వారా అధికారులు విస్తృత ప్రచారం చేయించి ప్రజల్లో ధైర్యాన్ని నూరుపోస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement