Wednesday, September 18, 2024

AP: అద్దంకి నియోజకవర్గంలో పార్టీని బ‌లోపేతం చేస్తాం… పురందేశ్వ‌రి

ప్ర‌కాశం : అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీని బ‌లోపేతం చేస్తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గం నుంచి సర్పంచ్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పురందేశ్వరి సమక్షంలో పార్టీ లో చేరారు.

ఈసందర్భంగా వారందరిని ఉద్దేశించి పురందేశ్వరి మాట్లాడుతూ… బీజేపీ జాతీయ భావాలతో పనిచేసే కార్యకర్తల సమూహమన్నారు. కాషాయ కండువా కప్పుకోవడంతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.

బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలతో బీజేపీ నడుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో అద్దంకి నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాగర్లమూడి వారి పాలెం సర్పంచ్ వెంకట రత్నంను పురందేశ్వరి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement