Monday, September 16, 2024

AP: క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంచుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కూడా మన క్రీడాకారులు అత్యుత్తమ ఫలితాలు, ర్యాంకులు సాధించే దిశగా అవసరమైన మేర‌కు సదుపాయాలు కల్పించడం, అత్యుత్తమ క్రీడల నిర్వహణకు అవసరమైన స్టేడియాల నిర్మాణాన్ని చేపడతామన్నారు. మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో క‌లిసి స‌మిష్టిగా అభివృద్ది చేస్తామ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్ సింగ్ న‌గ‌ర్ లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య న‌గ‌ర పాల‌క సంస్థ స్టేడియాన్నిబుధ‌వారం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో కలిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు. స్టేడియంలో వ‌ర్షం ప‌డిన‌ప్పుడు గ్రౌండ్ లో నీళ్లు నిలిచిపోతున్న విష‌యం క్రీడాకారులు కేశినేని శివనాథ్ దృష్టికి తీసుకురావడంతో కొంత‌మేర‌కు లేపాల్సిన అవ‌స‌రం వుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఎమ్మెల్యే బొండా ఉమా వివ‌రించారు.

స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కావాల్సిన విధంగా స్టేడియంను తీర్చిదిద్ద‌టంతో పాటు మౌళిక‌ స‌దుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బొండా ఉమాతో క‌లిసి స‌మిష్టిగా కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ మ‌హిళ అధ్య‌క్షురాలు దాస‌రి ఉద‌య‌శ్రీ, 61వ డివిజ‌న్ టీడీపీ ప్రెసిడెంట్ దాసరి దుర్గారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ న‌వ‌నీతం సాంబ‌శివ‌రావు, ఎస్సీసెల్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి బెజ్జం జైపాల్, మైనార్టీ సెల్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి బాషా, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement