Saturday, September 7, 2024

AP: కర్నూలు రైల్వేస్టేషన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.. ఎంపీ నాగరాజు

కర్నూలు రైల్వేస్టేషన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఎంపీ హోదాలో మొదటిసారి రైల్వేస్టేషన్ ను సందర్శించిన ఆయన.. స్టేషన్ మాస్టర్ శేషఫణితో కలిసి రైల్వేస్టేషన్ ను పరిశీలించారు. అనంతరం అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద చేపడుతున్న పనులను తనిఖీ చేశారు. పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగుల హెచ్.ఆర్.ఏ ను 10శాతం నుంచి 20 శాతానికి పెంచాలని, అలాగే కర్నూలు నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును వేయాలని అధికారులు ఎంపీని కోరారు. ఆనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ… రైల్వేస్టేషన్ లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కేంద్ర మంత్రులతో చర్చించి వాటిని పరిష్కరిస్తానన్నారు. ఇక ప్రజలు రైల్వే సేవలను వినియెగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ మునాజీ రావు, సర్వీస్ ఇంజినీర్ శివ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement