Monday, September 16, 2024

AP | వికసిత్ ఆంధ్ర కోసం సమష్టిగా కృషి చేయాలి : కలెక్టర్ విజయ క్రిష్ణన్..

కశింకోట (ప్రభ న్యూస్) : వికసిత్ భారత్ లో భాగంగా వికసిత్ ఆంధ్ర 2047 కు సంబంధించిన రాబోయే 5 సంవత్సరాల (2024-29) జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ….

అధునాతన పద్ధతులు వినియోగించడం ద్వారా ఇప్పుడు ఉన్న అభివృద్ధి, ఉత్పత్తులను పెంచవచ్చని, తద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్ధన్నారు. జిల్లా యాక్షన్ ప్లాన్(2024-29) తయారులో అధికారులు విజన్ తో పనిచేయాలని, డాక్యుమెంట్స్ తయారు చేయడంతో పాటు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి నిర్ణీతమైన సమయంలో సమర్పించాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ తయారు చేసే విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో చీఫ్ ప్లానింగ్ అధికారి జి.రామారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమీక్షా సమావేశంలో సంబందిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement