ఎమ్మిగనూరు టౌన్, ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : తమది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఎంత మాత్రం లేదని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని స్పష్టం చేశారు. శుక్రవారం నియోజకవర్గం లోని పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వీరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
అనంతరం చెన్నకేశవరెడ్డి స్వగృహానికి చేరుకున్న కేఈ కృష్ణమూర్తిని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇస్తూ… తాము స్నేహితులమని, ఆ స్నేహంతోని ఇరువురం కలుసుకున్నామే తప్ప.. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని తెలిపారు.