Tuesday, October 22, 2024

Vishakha – భ‌ర్త రెండో సెట‌ప్….రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న భార్య‌


స్పాట్ లోనే భ‌ర్త‌కు చెంప దెబ్బ‌లు
11 ఏళ్ల కాపురాన్ని నాశ‌నం చేశాడంటూ రోద‌న
మాజీ మిస్ వైజాగ్ సంసారంలో చిచ్చు

వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగుతున్న సంసారంలో రెండో సెట‌ప్ ఎంట‌రైంది. దీంతో కలతలు మొదలయ్యాయి. తన భర్త గురించి అసలు నిజాలు తెలుసుకుని లోలోపల కుమిలిపోయింది . . అయినా సరే తన భర్తను వదల్లేదు. తనకు భర్త కావాలంటూ నిరసనకు దిగింది. అలాగే మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా భర్తను పట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర, మీడియాకు తన భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టించింది. అంతేకాదు ఆ సన్నివేశాన్ని చూసి తట్టు కోలేకపోయిన నక్షత్ర. భర్త చెంప ఛెళ్లుమనిపించింది. సంచలనం రేపిన ఈ ఘటన విశాఖ సిటీలో చోటు చేసుకుంది.

- Advertisement -

ఆ ఇల్లాలు ఎవరో కాదు మిస్ వైజాగ్, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్ నక్షత్ర. సీన్ కట్ చేస్తే.. 11 ఏళ్ల కిందట వెనక్కి వెళ్తే.. ఓ మూవీ షూటింగ్‌లో నక్షత్ర-వెంటకసాయి తేజ‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. చివరకు పెళ్లికి దారి తీసింది. మనసులు ఒక్కటి కావడంతో నక్షత్ర-సాయితేజ 2017 లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది.
సజావుగా సాగుతున్న సంసారంలో ఏం జరిగిందో తెలీదు. భార్య నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే భర్త సాయి తేజ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గరే ఉంటున్నాడు. విష‌యం తెలుసుకున్న న‌క్ష‌త్ర అక్క‌డి వెళ్లింది.. భ‌ర్త వేరే మ‌హిళ‌తో ఉన్న స‌మయంలో మీడియా స‌మ‌క్షంలో ప‌ట్టుకుంది.. భ‌ర్త చేసిన అన్యాయాన్ని చెప్పి బోరు మంది.. పోలీసులు వ‌చ్చి కేసు న‌మోదు చేసి భ‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement