Friday, September 6, 2024

Vishaka – సింహాద్రి నాథుడు మహిమాన్వితుడు – మిజోరం గవర్నర్ హరిబాబు

విశాఖ‌ప‌ట్నం – ప్రపంచంలోనే వరాహ, నారసింహ రెండు అవతారాల కలయిక సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి ప్రత్యేకతని, అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు.
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు నేడు గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు సింహాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రసాద్ స్కీం పథకంతో పాటు పలు అంశాలను శ్రీను భాబును అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీంతో సింహగిరి మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు సింహాద్రినాథుడు శేష వస్త్రం తో సత్కరించి జ్ఞాపిక ప్రసాదాలు
అందచేసారు.. బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement