Saturday, September 21, 2024

Vijayawada – ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటు వెలికితీత‌

విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను నేడు అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం న‌దిలో ఈత‌గాళ్లు జ‌ల్లెడ ప‌డుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement