Saturday, September 14, 2024

Vijayawada – జత్వానితో ఎసిపి స్ర‌వంతి భేటి… కేసు వివ‌రాలు సేక‌ర‌ణ

విజయవాడ చేరుకున్న ముంబై నటి కాదంబ‌రి జత్వానీని విచారణాధికారి ఎసిపి స్రవంతి రాయ్ కలిశారు. ఆమె నుంచి ఈ కేసు వివ‌రాల‌ను సేక‌రించారు.. కిడ్నాప్, నిర్భంధం. అత్యాచారం, త‌ల్లి దండ్రుల‌కు వేధింపులు వంటి అంశాల‌ను జ‌త్వాని ఏసీపీ స్రవంతి రాయికి ఆధారాలతో సహా వివ‌రించారు.. వీటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో బంధించిన సమయంలో ఏయే పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పిన నటి భావోద్వేగానికి లోనే కన్నీటి పర్యంతమయ్యారు.

రేప్ కేసు పెట్టిన డిసెంబర్ 2023 నుంచి.. కేసు కొట్టేసిన మార్చి 2024 వరకు జరిగిన ఘటనలను విచారణ అధికారికి ముంబై నటి పూర్తిగా వివరించారు. జత్వానీ వివరణను స్టేట్‌మెంట్ రూపంలో, వీడియో రూపంలో తీసుకున్న కేసు విచారణ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం జోడించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ద‌మ‌వుతున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement