Sunday, September 8, 2024

రాములోరి క‌ళ్యాణానికి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

రామతీర్థంలోని శ్రీ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి సంద‌ర్భంగా రాముల వారి కళ్యాణానికి ఏర్పాట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి పరిశీలించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా సీతారాముల కల్యాణానికి భక్తులను అనుమతించ లేదని, ఈ ఏడాది శ్రీరామ నవమి రోజున జరిగే కల్యాణ ఉత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. రాముల వారి కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement