Friday, October 18, 2024

VZNM: మ‌రికొద్దిసేపట్లో సిరిమానోత్సవం..

విజయనగరం, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మ సిరిమాను రథం ముందుకు కదిలేందుకు సిద్ధమైంది. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఇప్పటికే సిరిమానును అధిష్టించారు. మరికాసేపట్లో సిరిమాను రథం ముందుకేగనుంది.

కోటగుమ్మం వరకు ముమ్మారు అటూఇటూ తిరగడంతో అమ్మవారి సిరిమాను సంబరం ముగియనుంది. మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement