Thursday, September 12, 2024

AP: కలెక్టరేట్ లో పోటెత్తిన అర్జీదారులు..

విజయనగరం, ఆగస్టు12 (ప్రభ న్యూస్) : జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వయంగా అర్జీలు స్వీకరించడంతో జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు.

వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్, జేసీ కార్తీక్, డీఆర్.ఓ ఎస్.డి.అనిత, తదితరులు పాల్గొన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో అధికారులు, ఉద్యోగుల సహాయ సహకారాలు ముఖ్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసి ఫలితాలు సాధించాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement