Monday, September 16, 2024

గన్నవరం చేరుకున్న వెంకయ్యనాయుడు.. స్వాగతం పలికిన గవర్నర్..

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో పర్యటించనున్నారు. కాసేపటి క్రితమే ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్​కు చేరుకోనున్నారు. జాతీయకవి దామరాజు ‘పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించనున్నారు. అలాగే సాయంత్రం విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాల వజ్రోత్సవంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement