Sunday, September 8, 2024

AP : జగన్మాతను దర్శించుకున్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్

ఎన్టీఆర్ బ్యూరో , ప్రభ న్యూస్ : విజయవాడలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న జగన్మాత ను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా లు దర్శించుకున్నారు. సోమవారం అమ్మవారి దర్శనానికి ఆలయాలకు విచ్చేసిన వీరికి, అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య, ఆలయ ఈఈ కోటేశ్వరరావు లు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. వీరితోపాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇతర బిజెపి, జనసేన నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement