Friday, October 18, 2024

AP: అవ‌మానం త‌ట్టుకోలేక విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ఇడుపుల‌పాయ : వేంపల్లి ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూంలో వాటర్ లైన్ పైపునకు చున్నీతో ఉరి వేసుకుని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నేడు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషా ఖురేషి గా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్ కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద పోయింది. మిస్ అయిన మొబైల్ ఫోన్ ను జమీషా ఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించి ట్రిబుల్ ఐటీ అధికారులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement