Thursday, September 19, 2024

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ భ‌రించ‌లేక రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తుగ్గ‌లి మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో అప్పుల బాధ భరించలేక రైతు సుంకన్న (62) ఈరోజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఉప్పరపల్లె గ్రామంలో తనకున్న నాలుగు ఎకరాల సొంత పొలంతో పాటు అదనంగా మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు ఎక్కువగా కావడంతో వాటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై కౌలుకు సాగు చేస్తున్న పొలంలోనే రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై జొన్నగిరి ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు భార్య అచ్చమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుళ్ల‌కు, కుమారుడికి పెళ్లిళ్లు అయిపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement