Thursday, September 12, 2024

Tuesday – నిండుగా శ్రీశైలం జలాశయం – గేట్లు ఎత్తి వేతకు సమాయత్తం

కర్నూల్ – ప్రభ న్యూస్ బ్యూరో శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ఎల్లుండి శ్రీశైల జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు గ ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారి నిర్ణయించారు..

ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ,అధికారులు సుమారు 5 లేదా 6 రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం జూరాల,సుంకేసుల నుండి 4,41,222 క్యూసెక్కులు నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 కాగా ప్రస్తుతం 156.3860 గా ఉంది. మరోపక్క ఇప్పటికే కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు 61,111 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే సోమవారం రాత్రికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం లేకపోలేదు.

- Advertisement -

దీనితో ఎల్లుండి ఉదయం జలాశయం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి చీరే, సారా ,హరతి సమర్పించి అనంతరం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,అధికారులు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయనున్నారని శ్రీశైలం జలాశయ ఎస్సీ శ్రీరామమూర్తి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement