Friday, October 18, 2024

Trolling – స్కిల్ కేసు విచారిస్తున్న జ‌డ్జిల‌పై అనుచిత వ్యాఖ్య‌లు …. కోర్టు ధిక్కార పిటిష‌న్ వేసిన ఎజి

అమ‌రావ‌తి – స్కిల్ స్కాంలో ద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. జడ్జీలపై అభ్యంతరకర పోస్టుల‌పై రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. దీంతో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ ఏజీ దాఖలు చేశారు. ఈ. కేసును డివిజన్ బెంచ్ ముందు ఎజి మెన్షన్ చేయ‌డంతో రేపు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement