Friday, September 13, 2024

AP: 24మంది మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ..

అమరావతి : ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. క‌మిష‌న‌ర్ల బ‌దిలీపై మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

ప‌లువురు క‌మిష‌న‌ర్లను మాతృశాఖ‌కు స‌ర్కార్ బ‌దిలీ చేసింది. మ‌రికొంత‌మంది క‌మిష‌న‌ర్లను మున్సిప‌ల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల‌ని ప్రధాన కార్యద‌ర్శి అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement