Saturday, October 5, 2024

AP | ట్రాక్టర్‌ బోల్తా.. రైతు దంపతుల మృతి..

బెలుగుప్ప (అనంతపురం) ప్రభన్యూస్‌ : వ్యవసాయ పనుల నిమిత్తం రైతు దంపతులు ఇరువురు కలిసి పొలానికి ట్రాక్టర్‌లో వెళుతండగా, గతుకుల రోడ్డు నుండి మెయిన్‌ రోడ్డుపైకి ఎక్కుతున్న సమయంలో ట్రాక్టర్‌ బోల్తా పడి మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధి లోని బేలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

నక్కలపల్లి గ్రామానికి చెందిన బోడుమల్లు ఈశ్వర్‌రెడ్డి (45) బోడుమల్లు సువర్ణమ్మ (39) రైతు దంపతులు ఇరువురు ఆదివారం 11 గంటల సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో ఇద్దరూ పొలానికి వెళుతుండగా ట్రాక్టర్‌ బోల్తా పడడంతో దాని కింద పడి మృతి చెందారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో వారి పిల్లలైనా పునీత్‌ రెడ్డి (12), సుమలత (14) అనాధలయ్యారు.. ఆనాధులైన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement