Thursday, September 19, 2024

NTR Dst. | రేపు కూడా స్కూళ్లకు సెలవు…

ఏపీలోని పలు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత ప్రభావం ఇంకా తగ్గనందున రేపు (బుధవారం) స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

వర్షాలు, వరదల ప్రభావంతో జిల్లాలోని పలు పాఠశాలలు పునరావాస కేంద్రాలుగా మారాయి. అలాగే వరద బాధితులు ఎక్కువగా పునరావాస కేంద్రాల్లో ఉండడంతో పాఠశాలలు నడపలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల బుధవారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు…. ఈ ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement