Wednesday, September 18, 2024

AP | రేపు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు

రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్ర‌జ‌టు అల్లాడిపోతున్నారు. ఇక‌ రేపు (సెప్టెంబర్ 2) కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో రేపు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఏపీ సీఎం చంద్రబాబు కూడా రేపు సోమవారం నాడు విద్యాసంస్థలకు సెలవు అని అధికారికంగా ప్రకటించారు. ఆదేశాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement