Thursday, September 19, 2024

Tirupati – వరద బాధితులకు హెడ్ కానిస్టేబుల్ విరాళం

తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, తిరుపతి జిల్లా పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ , స్టేట్ పోలీస్ అసోసియేషన్ గౌరవ సలహాదారులైన జి.శంకర్ రెడ్డి, విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఈరోజు రూ.20,000/- ల డిమాండ్ డ్రాప్ ను జిల్లా ఎస్పి సుబ్బరాయుడు చేతుల మీదుగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ, మాట్లాడుతూ ప్రస్తుతం విజయవాడలో నెలకొని ఉన్న ఆపత్కర సమయంలో అక్కడి ప్రజలకు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి తన వంతు బాధ్యతగా ఈరోజు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 20 రూపాయలను విరాళంగా అందజేయడం చాలా అభినందనీయమన్నారు.

- Advertisement -

.హెడ్ కానిస్టేబుల్ శంకర్ రెడ్డి గతంలో కూడా 2016లో వరదలప్పుడు 10,000/- రూపాయలు, అంతకుముందు రెండుసార్లు అప్పటి ఎస్పీల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి వరద బాధితుల సహాయార్థం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.

అదేవిధంగా కరోనా టైంలో కూడా డ్యూటీలో ఉన్న తిరుపతి పోలీసులకు అన్నదానం కొరకు 30,000/- రూపాయలు వితరణ చేసినట్లు తెలిసిందన్నారు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు తన వంతు సహాయంగా బాధితులకు విరాళాలు అందజేస్తున్న శంకర్ రెడ్డి కి జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపినారు. ఈ సందర్భంగా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జె. వెంకట్రావు, తిరుపతి పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, పలువురు అధికారులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement