Wednesday, October 2, 2024

Tirumala – కుమార్తెలతో కలసి దేవదేవుడి సన్నిధిలో పవన్ కల్యాణ్ – ప్రాయశ్చిత్త దీక్ష విరమణ ..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
స్వామి వారికి ప్రత్యేక పూజలు..
వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన పవన్ కళ్యాణ్ గారు
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరణ

తిరుమల – సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కుమార్తెలు ఆద్య కొణిదెల, పలీనా అంజని కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -


అన్నప్రసాద స్వీకరణ


స్వామి వారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

చిన్న కుమార్తెతో డిక్లరేషన్


దర్శనానికి ముందు చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలతో డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ క డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ రితో పాటు శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ , తిరుపతి, రైల్వే కోడూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు , అరవ శ్రీధర్ , ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ , కళా దర్శకులు ఆనంద సాయి స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

వారాహి డిక్ల‌రేష‌న్ లో ఏముంది..

ఇక‌ శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు పవన్‌ కల్యాణ్‌.. స్వామివారి దర్శనం. దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు పవన్‌.. దీంతో.. వారాహి డిక్లరేషన్‌ బుక్‌లో ఏముందు? అనే చర్చ సాగుతోంది.. రెడ్‌ కలర్‌లో ఉన్న ఆ బుక్‌ కవర్‌ పేజీపై.. పై భాగంలో !! ధర్మో రక్షతి రక్షితః !!.. మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్‌.. కింది భాగంలో తిరుపతి 03-10-2024 అని రాసుకొచ్చారు.. దీంతో.. ఆ బుక్‌లో ఎలాంటి అంశాలు పొందుపర్చారనేది ఆసక్తికరంగా మారింది..

రేపు తిరుప‌తిలో వారాహి బ‌హిరంగ స‌భ ..

అయితే, రేపటి వారాహి సభలో వారాహి డిక్లరేషన్‌ బుక్‌లోని అంశాలను ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ తెలియజేస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని బాలాజీ కాలనీ సర్కిల్, ఎస్వీ మ్యూజిక్‌ కాలేజీ దగ్గర ఎస్వీయూ క్యాంప్‌ స్కూల్‌లో వారాహి బహిరంగ సభను జరగనుంది.. ఈ బహిరంగ సభలో వారాహి వాహనం నుంచి జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రసంగించనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement