Monday, September 16, 2024

AP: తిరుమలలో మరోసారి చిరుత కలకలం..

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తులు కారులో ఘాట్ రోడ్డులో వెళుతుండగా.. చిరుత అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు కనిపించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement