Monday, September 23, 2024

Tirumala – అప‌రాథం చేస్తే నాతో పాటు నా కుటుంబం స‌ర్వ‌నాశ‌నం కావాలి:భూమ‌న

తిరుమ‌ల – గత పాలకులు కల్తీ నెయ్యి వాడి దోపీడీకి పాల్పడ్డారంటూ కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ‘‘నేను గాని అపరాధం చేసి ఉంటే నాతో పాటు నాకు కుటుంబం కూడా సర్వ నాశనం అయిపోవాలి. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. గోవిందా.. గోవిందా’’ అని ఆయన ప్రమాణం చేశారు.

శరణాగతి తండ్రి.. గత కొన్ని రోజులుగా నా మనసు కలత చెందుతోందని కరుణాకర్ రెడ్డి అన్నారు. కలుషిత రాజకీయ మనష్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డూ వ్యవహారం కళంకితమైనదని ఆయన వ్యాఖ్యానించారు. క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని, అపచారమని పేర్కొన్నారు.

- Advertisement -

కాగా ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో భూమన కరుణాకర్ రెడ్డి స్నానం చేశారు. అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామివారికి మొక్కారు.

తిరుపతికి తరలింపు
ప్రమాణస్వీకారం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతి తరతలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన వాహనంలోనే తిరుపతికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement