Friday, October 4, 2024

AP | పిడుగుపడి ముగ్గురు మృతి..

ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో ఆరుగురు కూలీలు పొలం పనులకు వెళ్లారు. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో పక్కనే ఉన్న చెట్టు వద్దకు వచ్చి నిల‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ కూలీలను స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement