Saturday, October 26, 2024

Threatening Call – తిరుపతిలో నేడు మరో హోటల్ కు బాంబు బెదిరింపు..

రాజు పార్కు కుఫోన్ కాల్ బెదిరింపు
అప్రమత్తమమైన అలిపిరి పోలీసులు
డాగ్ బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు
పోలీస్ చక్రబంధంతో హోటల్

తిరుపతి క్రైమ్ ( ఆంధ్రప్రభ): తిరుపతి నగరంలో ఇటీవల కాలంలో పెద్దపెద్ద హోటల్కు బాంబు కాల్స్ బెదిరింపు రావడంతో పోలీసులకు సవాల్ గా మారుతున్నది. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలోని రాజు పార్క్ హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.. దీంతో ప్రమత్తమైన అలిపిరి సిఐ. రామ్ కిషోర్ తన సిబ్బందితో వెళ్లి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు..ఇక . తిరుపతి నగరంలో పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని విస్తృతంగా వాహనాలు తనిఖీ తో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపరుతున్నారు. ఏదేమైనా దీనిపై పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు ముమ్మురంగా చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement