Saturday, June 29, 2024

Janasena | ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీ ఇదే…

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఎన్నికల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. ఈ కమిటీలో బి.మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్, వాములపాటి అజయ్ కుమార్, మారెడ్డి శ్రీనివాస్, ప్రొఫెసర్ కె.శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. పారాపురం నియోజకవర్గ సమన్వయ ఇన్ చార్జిగా మారెడ్డి శ్రీనివాస్ వ్యవహరించనున్నారు.

జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు, సమన్వయం, ప్రచార వ్యవహారాలు, పోల్, బూత్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను ఈ కమిటీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. ఈరోజు పిఠాపురంలో కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement