Friday, October 18, 2024

Third Degree – ర‌ఘ‌రామ‌రాజు కేసులో మ‌రో ట్విస్ట్

విచార‌ణాధికారిని మార్చిన స‌ర్కార్
ర‌మ‌ణ‌మూర్తి నుంచి ఎస్పీ దామోద‌ర్ కు కేసు బ‌దిలీ

అమరావతి: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆయన కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ పోలీసులు కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement