Tuesday, October 22, 2024

AP: కాణిపాకం హుండీల లెక్కింపులో చేతివాటం..

వంద గ్రాముల గోల్డ్ బిస్కెట్ కు టెండ‌ర్
గోల్డ్ పరిశీల‌న‌కు వ‌చ్చిన బ్యాంక్ అప్రైజర్‌
కానుక‌లు ప‌రిశీలిస్తూ గోల్డ్ బిస్కెట్ కొట్టేసిన ప్ర‌కాశ్
సీసీ కెమారాలో గుర్తించిన ఈవో
పోలీసుల‌కు ఫిర్యాదు..అరెస్ట్

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు.

ఈ క్రమంలో స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్‌ ప్రకాశ్ ఈ లెక్కింపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను తన సంచిలో దాచుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ఆలయ ఈవో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని ధ్రువీకరించారు. అనంతరం బంగారు బిస్కెట్‌ను స్వాధీనం చేసుకుని అతడిని కాణిపాకం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement