Monday, July 1, 2024

Chandrababu: కుప్పం ప్రజలు నాకు ప్రత్యక్ష్య దేవుళ్ళు..

మళ్లీ కుప్పం బిడ్డగానే పుడతా: చంద్రబాబు
నలభై ఏళ్లుగా నన్ను అందరిస్తున్నారు… మీ రుణం తీర్చుకోలేనిది…
కుప్పం సభలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు

కుప్పం, జూన్ 25(ప్రభ న్యూస్ ): నలభై సంవత్సరాల నుండి కుప్పం నియోజకవర్గ ప్రజలు నన్ను సొంత బిడ్డగా అందరించారని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో మంగళవారం సాయంత్రం సీఎం నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే వర్షం మొదలైంది.

దీంతో సమావేశం కొనసాగిద్దామా కాసేపు ఆపుదామా అని సీఎం కోరగా.. కొనసాగించాలని కార్యకర్తలు కోరారు. కుప్పం దేవుళ్లను నేరుగా చూడటానికి ఇక్కడికి వచ్చాన్నారు. కుప్పంలో నా సామాజికవర్గ ప్రజలు లేరన్నారు. 40ఏళ్లుగా గెలిపిస్తున్న ఈ వెనుకబడ్డ ప్రజలే నా సామాజిక వర్గం అని తెలిపారు. మరోసారి కుప్పం బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాన‌ని చంద్రబాబు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement