Friday, September 20, 2024

Venkaiah Naidu | ఆ వార్త‌లు ఎంత‌గానో క‌ల‌చివేశాయి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీపై వస్తున్న వార్తలు తనను ఎంతగానో కలవరపరిచాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయమై ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

‘‘తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం మాత్రమే కాదు, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, పంచటం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తోంది. ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం వున్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత మరింత కీలకం. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదు. ఈ నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి సూచించాను. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారిని కోరాను. అందుకు ఆయన సమ్మతించారు’’ అని వెంకయ్య నాయడు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement