Friday, September 6, 2024

AP: భార్య ఒడిలోనే తుదిశ్వాస… గుండెపోటుతో ఉద్యోగి మృతి

అనంతపురం : ఓ ఉద్యోగి గుండెపోటు రావ‌డంతో భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున ఇవాళ తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు.
గుండెపోటుతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

అక్కడ పనిచేస్తూనే డిప్యుటేషన్ పై జెడ్పీకి వచ్చి పూర్వ సీఈఓ సీసీగా పని చేశారు. ఆ తరువాత డిప్యుటేషన్ రద్దు చేసుకుని తిరిగి బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా వెళ్లిపోయారు. సోమవారం రాత్రి కొంచెం అస్వస్థతకు గురైనట్లు బంధువులు తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన.. ఎందుకో గుండె పట్టుకున్నట్లు ఉందంటూ భార్యకు చెప్పి.. ఆమె ఒళ్లో నిద్రపోయినట్లు తెలుస్తోంది. భార్య ఒడిలోనే ఆయన తుదిశ్వాస వదిలారు. ఆయన ఎక్కడ పనిచేసినా అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు. మృదు స్వభావిగా ఆయనకు మంచి పేరుంది. మలికార్జున గుండెపోటుతో మరణించారని తెలిసి జెడ్పీ ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన జెడ్పీ ఉద్యోగుల్లో విషాదం మిగిల్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement