Tuesday, September 17, 2024

TG – ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌ధాన కార్యాల‌యంలో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాలు షురూ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ లోని ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌ధాన కార్యాల‌యంలో వ‌ర‌సిద్ధి వినాయ‌క న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా శ‌నివారం ప్రారంభ‌మ‌య్యాయి. కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మండ‌పంలో గ‌ణ‌ప‌తి ప్ర‌తిమను ప్ర‌తిష్ఠించారు.

ఆంధ్ర‌ప్ర‌భ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ముత్తా గౌత‌మ్‌, సునీత దంప‌తులు తొలి పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సిబ్బంది కూడా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్‌, న్యూస్ నెట్ వ‌ర్క్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పసునూరి భాస్కర్‌, ఏడీవీటీ జనరల్‌ మేనేజర్‌ గంజి వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(అడ్మిన్‌) పసునూరి రమేష్‌, ఆంధ్ర‌ప్ర‌భ , స్మార్ట్ ఎడిష‌న్‌, వెబ్‌, యూట్యూబ్ ఛాన‌ల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement