Monday, October 7, 2024

TG – ఆ మాజీ మేయర్ అడుగులు టీడీపీ వైపు..

హైదరాబాద్ – మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మనమరాలు ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యం లో ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు ఇచ్చారు మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి. తీగల కృష్ణారెడ్డిలు .

నేటి ఉదయం హైదారాబాద్ లోని చంద్రబాబు నివాసానికి హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తో కలిసి మల్లారెడ్డి , మర్రి వెళ్లారు. వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను ఇచ్చారు మల్లారెడ్డి.

.అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తో దాదాపు గంట పాటు సమావేశం అయ్యారు .

ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడుతూ. త్వరలో టీడీపీలో చేరతానని అన్నారు.. టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని అన్నారు . తెలంగాణలో టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారనీ కొందరు ఎంఎల్ఏ కూడా టీడీపీ లు చేరనున్నారని చెప్పారు. .. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

- Advertisement -

కాగా, పార్టీ మారడం పై ఎమ్మెల్యే మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement