Friday, September 20, 2024

TG – అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ ..

హైదరాబాద్‌, : గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నది. 32 వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఆన్సర్‌ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్షలను జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇక త్వ‌ర‌లోనే అర్హ‌త సాధించిన అభ్య‌ర్ధుల‌కు హాల్ టిక్కెట్స్ ను ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement