Thursday, October 3, 2024

AP | ప్రశాంతంగా టెట్ !

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (స్కూల్‌ అసిస్టెంట్స్‌ లాంగ్వేజెస్‌)లు ప్రశాంతంగా జరిగాయి. ఎస్‌ఏకు దరఖాస్తు చేసుకున్న 23,301 మందికి గాను 20,413 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 63 సెంటర్లలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 12732 మందికి గాను11,091 మంది అనగా 87.11శాతం మంది హాజరయ్యారు.

అదేవిధంగా మధ్యాహ్నం 54 సెంటర్లలో జరిగిన పరీక్షలకు 10,569 మందికి గాను 9,322 మంది అనగా 88.20 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, జిల్లా కలెక్టర్‌ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారులు, ఫ్ల‌యింగ్‌ స్క్వాడ్స్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement