Saturday, September 7, 2024

AP: ఈవీఎం ట్యాంప‌రింగ్ తోనే టీడీపీ గెలుపు.. ర‌వీంద్ర‌నాధ్ రెడ్డి

సింగ‌పూర్ నుంచి బార్ కోడ్ తో మేనేజ్
ఇవి ప్ర‌జ‌లు వేసిన ఓట్లు కాదు
బాబు వేయించుకున్న ఓట్లు
రాష్ట్ర వ్యాప్తంగా సాగిన స్కామ్
న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తానంటున్న‌
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాధ్ రెడ్డి

ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి చంద్ర‌బాబు నాయుడు గెలిచార‌ని కమలాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగ‌పూర్‌లో కూర్చొని టెక్నిక‌ల్‌గా ట్యాంప‌రింగ్ చేశార‌ని తెలిపారు. క‌డ‌ప‌లో ఆయ‌న ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ…. బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారంటూ ఆయ‌న‌ అనుమానం వ్య‌క్తం చేశారు.

బాబుకు ప్ర‌జ‌లు అస‌లు ఓట్లు వేయ‌లేద‌ని, చంద్రబాబే ట్యాంప‌రింగ్ ఓట్లు వేయించుకున్నార‌ని ఆరోపించారు.. టీడీపీ అధినేత వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి ఇదంతా న‌డిపించార‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్ జ‌రిగింద‌న్నారు. దీనిపై త్వ‌ర‌లోనే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement