Tuesday, October 22, 2024

Tirupati : టీడీపీ నేత దారుణ హత్య

టీడీపీ నేత దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిల్లకూరు మండలం నాంచారంపేటలో మల్లారపు హరిప్రసాద్ (20) తన ఇంట్లోనే హత్య చేయబడ్డాడు. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులు హరిప్రసాద్ నిద్రిస్తుండగా.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.

మంటల్లో కాలిపోతూ.. కాపాడండి అని అరుస్తూనే హరిప్రసాద్ మృతి చెందాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. హరిప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement