Friday, September 20, 2024

Tadipathri – కేశఖండనకు వెళ్లి.. తిరిగి రాని లోకాలకు..

తాడిపత్రి టౌన్ ఆగస్టు 21 (ప్రభన్యూస్): కుటుంబంతో కలిసి కేశఖండనకు వెళ్లి తిరిగి వస్తూ కడప ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి మండల పరిధిలోని గెన్నవారిపల్లి కాలనీలో నివాసం ఉంటున్న ప్రతాప్ రెడ్డి (24) తన భార్య ప్రమీల (21), ప్రమీల అమ్మ వెంకటలక్ష్మి (47) ముగ్గురు కారులో మంగళవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి గ్రామానికి బంధువుల కేశఖండన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాడిపత్రి మండల పరిధిలోని వంగనూరు గ్రామ సమీపంలో కడప ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రతాప్ రెడ్డి ప్రమీల అక్కడికక్కడే మృతిచెందగా వెంకటలక్ష్మి హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది..

ప్రతాప్ రెడ్డి, ప్రమీల గత నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఘటనలో లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టడం వల్ల చోటుచేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో లారీ డ్రైవర్ నిద్ర మత్తుల్లో ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement