Saturday, September 7, 2024

AP: కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

క‌ర్నూలు : కర్నూలు జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ పై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబర్ లోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు.

ప్రవీణ్ కుమార్ ఆ స్థలాన్ని 154/1 సబ్ డివిజన్ గా మార్చి మొత్తం 15దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో బహిర్గతం కావడంతో ఆయనను సస్పెండ్ చేసి డీఐజీ చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో కార్యాలయ సీనియర్ క్లర్క్ రాఘవేందర్ ను కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ గా తాత్కాలికంగా నియమించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement