Thursday, September 12, 2024

AP: విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కడపలో విషాద ఘటన చోటుచేసుకుంది. కడప పట్టణంలోని బెల్లంమండి వీధిలో సైకిల్ తొక్కుకుంటున్న ఇద్దరు విద్యార్థులు విద్యుద్ఘాతానికి గురై ఒకరు మరణించగా, మ‌రో విద్యార్థికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

ఇంటర్నేషనల్ కళ్యాణమండపం సమీపంలో విద్యుత్ వైర్లు తెగి పడగా.. అటుగా సైకిల్ తొక్కుతూ వెళ్ళిన ఇద్దరు విద్యార్థులు ఆ తెగిన పడిన కరెంట్ వైర్లకు తగిలిపడిపోయారు. వారిలో ఒక విద్యార్థి అక్కడిక్కడే మరణించగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి విచారణ వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విషాద ఘటనపై వివరణ ఇవ్వాలను అధికారులను ఆదేశించారు. కాగా విద్యార్థులు తెగి పడిన కరెంటు తీగలకు చిక్కుకొని మరణించిన సీసీ టీవి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement