Thursday, October 3, 2024

AP: పిడుగుపాటుకు విద్యార్థిని మృతి..

చీరాల, అక్టోబర్ 3(ప్రభ న్యూస్) : పిడుగుపాటుకు విద్యార్థిని మృతిచెందిన సంఘటన గురువారం ఉదయం చీరాల మండలంలోని చీరాల నగర్ లో జరిగింది. పిడుగుపాటుకు బీటెక్ విద్యార్థిని తులసీ అక్కడక్కడే మృతి చెందింది. తెలిసిన వివరాలు మేరకు.. బాపట్ల పట్టణ పరిధిలోని నరాలశెట్టివారిపాలెంకు చెందిన నూతక్కి వెంకటేశ్వర్లు, పార్వతిలకు ఓకే ఒక్క సంతానం తులసీ.

మృతురాలు బాపట్ల ఎన్టీఆర్ ఫుడ్ టెక్నాలజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతుంది. దసరా సెలవులకు చీరాల నగర్ లో ఉంటున్న అమ్మమ్మ సరోజినీ ఇంటికి వచ్చింది. ఇవాళ‌ ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. దీంతో పిడుగుపాటుకు విద్యార్థిని తులసీ మృతిచెందింది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement